స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సం యుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.


నా పేరు సూర్య తర్వాత దాదాపు ఏడాది పాటు వెయిట్ చేసి మరి అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే టైటిల్ ఎనౌన్స్ చేస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో టబు నటించడం కూడా అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో క్రేజీ డీల్స్ వస్తున్నాయని తెలుస్తుంది.


ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను 9 కోట్లకు అమ్మేశారట. నిర్మాతలు 12 కోట్ల దాకా డిమాండ్ చేసినా ఈమధ్య తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో పెద్దగా రాణించని కారణంతో 9 కోట్లకే ఈ సినిమా ఫైనల్ అయ్యిందట. నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ 9 కోట్లకి ఒప్పుకోవడం సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావితం ఉంటుందని అలా ప్లాన్ చేశారట.       


ఓవర్సీస్ లో ఎక్కువకి అమ్మేసి తెలుగు రెండు రాష్ట్రాల్లో హిట్టైనా అక్కడ బ్రేక్ ఈవెన్ రాకపోతే సినిమా ఫ్లాప్ అనేస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ తెలివిగా బన్ని సినిమాను మరీ ఎక్కువగా కాకుండా అలా అని తక్కువ చేయకుండా డీల్ క్లోజ్ చేశారట. తమన్ మ్యూజిక్ అందిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ తో పాటుగా మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా నటిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: