టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంతకముందు బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి సినిమాలతో కొంత ఢీలా పడ్డప్పటికీ, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సూపర్ డూపర్ హిట్ కొట్టి మహేష్ కు కెరీర్ పరంగా మంచి జోష్ ని ఇచ్చింది. ఇక ఆ తరువాత ఆయన కెరీర్ సిల్వర్ జూబిలీ సినిమాగా వచ్చిన మహర్షి అయితే అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, సూపర్ స్టార్ క్రేజ్ ని విపరీతంగా పెంచింది. ఇకపోతే ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా హిట్ కొట్టి, వరుసగా హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు మహేష్. 

ఇక ఆ విషయం అటుంచితే, కొన్నేళ్ళుగా మన సూపర్ స్టార్ ని మీరు బాలీవుడ్ కి వెళ్తారా, హిందీ సినిమాలు చేస్తారా అని ఎవరైనా విలేఖర్లు ప్రశ్నిస్తే, ఆయన పెద్దగా ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చే వారు కాదు. పైగా అక్కడికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడం కంటే, మన తెలుగులోనే మంచి సినిమాలు చేయవచ్చు అనే రీతిలో మహేష్ సమాధానమిచ్చేవారు. నిజానికి మహేష్ ఆ విధంగా సమాధానం ఇవ్వడం వెనక కొంత ఆంతర్యం ఉందనేది మనకు కొంత అర్ధం అవుతుంది. గతంలో రామ్ చరణ్, జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, అది అతి పెద్ద డిజాస్టర్ గా మారడంతో మళ్ళి అక్కడ ఇప్పటివరకు సినిమా చేయలేదు. అయితే అటువంటి మరికొందరి అనుభవాలు మహేష్ కు తెలుసు కాబట్టే, సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళూ బాలీవుడ్ కి వెళ్లే విషయమై కొంత తాత్సారం చేస్తూ వచ్చిన మన సూపర్ స్టార్, అతి త్వరలో అక్కడ అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం, 

అయితే అది డైరెక్ట్ హిందీ సినిమా చేసి కాదట, ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే ఆ ఆలోచన మాత్రం సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత గారిదని అంటున్నారు. అంతేకాక అక్కడి ప్రేక్షకుల అభిరుచి మేరకు, సరిలేరు నీకెవ్వరు లో కొన్ని సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, ఎప్పటినుండో మహేష్ ను బాలీవుడ్ సినిమాలో చూడాలనుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరిక మాత్రం ఈ విధంగా కొంతవరకు తీరుతుందనే చెప్పాలి.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: