మెగాస్టార్ చిరంజీవి తొలిసారి స్వతంత్ర సమరయోధుడు గా నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కతున్న ఈ సినిమా మరొక ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ట్రైలర్ మరియు ఒక సాంగ్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింతగా పెరగడంతో, రేపు సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల అంచనాలు తప్పకుండా అందుకుంటాం అని అంటోంది సైరా యూనిట్. 

మెగాస్టార్ సరసన నయనతార జోడి కట్టిన ఈ సినిమాను రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తుండగా, రత్నవేలు కెమెరా మ్యాన్  గా, అలానే బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే రేపు ఉదయం ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ కాసేపటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెల్పింది. బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో రేపు ఉదయం గం.10.30 ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ రాబోతున్న ఈ ట్రైలర్ లో సినిమాలోని అత్యద్భుతమైన యక్షన్, ఛేజింగ్, యుద్ధ సన్నివేశాలు పొందు పరిచినట్లు సమాచారం. 

ఇక ఆ భారీ సీన్స్ కోసం ఎంతో శ్రమించిన సైరా టీమ్ పనితనం కూడా ఈ ట్రైలర్ లో చూపించనున్నట్లు టాక్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, నిహారిక కొణిదెల, అనుష్క శెట్టి, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, రవి కిషన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమాకు ఇటీవల సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: