తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 26 చిత్రంగా తెరక్కేకుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'.. ఆ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకతం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. అంతేకాదు.. సీనియర్ నటి విజయశాంతి 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖానికి రంగువేసుకుంటుంది. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ ఒక పవర్ ఫుల్ మిలటరీ మేజర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. 


వివరాల్లోకి వెళితే.. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్  షూటింగ్ ను హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసుకొని రానున్న సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఆ చిత్ర యూనిట్. మాములుగా సంక్రాంతి అంటే తెలుగు ప్రజలతో పాటుగా సినీ ప్రజలకు కూడా పెద్ద పండగనే చెప్పాలి. 


ఆ రోజు కనుక సినిమాలు రిలీజ్  చేస్తే, రైతులకు ఎలా చేతికి పంట వస్తుందో, సినిమా వాళ్లకు కూడా ఫుల్ కలెక్షన్స్ ను కొల్లగొట్ట వచ్చునని ఆలోచనలో సినీ పరిశ్రమ మొత్తం వారి సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఇలా ఉండగా ఈ సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతాయనే టాక్ సినీ ఇండస్ట్రీలో వినపడుతుంది. 


ప్రస్తుతం మహేష్ సంక్రాంతికి చాలా సినిమాలో రిలీజ్ అవుతన్నాయి. నా సినిమా కూడా రిలీజ్ చేస్తే కలెక్షణాలు గండి పడుతుందనే ఆలోచనలో పడ్డాడు. దానితో ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేస్తే బెటర్ అని నిర్ణయించున్నాడు. మరి ఈ సినిమా పోస్ట్ పోనే అవుతుందనే వార్తలు వినపడుతున్నాయి మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: