ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూస్తున్నా ‘సైరా’ మూవీ వార్తలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ మ్యానియా కనీసం రెండు వారాలు ఉండబోతోంది. ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ విడుదల తరువాత రెండు వారాల గ్యాప్ తో రాబోతున్న ఒక చిన్న సినిమా ప్రమోషన్ ‘సైరా’ ప్రమోషన్ తో సరిసమానంగా ప్రారంభం కాబోతూ ఉండటం ‘సైరా’ యూనిట్ కు షాక్ ఇస్తున్నట్లు షాక్.

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెపుత’ మూవీ విడుదల అక్టోబర్ 18న ఫిక్స్ చేసారు. అయితే ఈ మూవీ విడుదలకు ఇంకా మూడు వారాలు సమయం ఉన్నా ఇంకా ‘సైరా’ విడుదల కాకుండానే ఈమూవీ ప్రమోషన్ ను మొదలు పెడుతున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు తరుణ్ భాస్కర్ తో యాంకర్ అనసూయ మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఒక టీమ్ గా ఏర్పడి అక్టోబర్ మొదటివారం నుండి మన ఇరు రాష్ట్రాలలోని అనేక డిగ్రీ కాలేజీలు ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీలలో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అక్కడకు వెళ్లి కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్దుల మధ్య చేస్తే ఆ మూవీకి విడుదల కాకముందే మంచి క్రేజ్ వస్తుంది. 

ఇప్పుడు ఇలాంటి వ్యూహం నిర్మాతగా విజయ్ దేవరకొండ అనుసరిస్తున్నాడు. ఇది చాలదు అన్నట్లు ఈ మూవీ ప్రమోషన్ సాంగ్ ను షూట్ చేసి దసరా పండుగ రోజులలో బుల్లితెర పై  ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. దీనితో ఒకవైపు ‘సైరా’ మ్యానియా కొనసాగుతూ ఉంటే దసరా పండుగ జోష్ ను తమ సినిమాకు ప్రమోషన్ గా వాడుకోవడానికి విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే నిర్మాతగా కూడ చాల తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: