సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సమంత ఏదైనా ఒక కామెంట్ చేస్తే వెంటనే అది వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోకుండా మౌనం కొనసాగిస్తున్న సమంత లేటెస్ట్ గా చేసిన ఒక ట్విట్ వెనుక అర్ధాలు ఏమిటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

'గతంలో తగిలిన తీవ్ర గాయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే ఎంతో ఓదార్పు దొరుకుతుంది. అక్కడ నిన్ను నువ్వు గుర్తించగలవు. అప్పుడే నీకు అసలైన మనశ్శాంతి లభిస్తుంది'' అంటూ ఒక ట్విట్ చేసి దానికి ఒక ఫోటోను ఎటాచ్ చేసింది. దీనితో సమంతకు అంత పీడ కలలా వెంటాడుతున్న గాయం జ్ఞాపకాలు ఏమిటి అంటూ ఆమె అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. 

అంతేకాదు సమంతకు గతంలో బయటకు చెప్పుకోలేని కష్టం ఏమైనా వచ్చిందా అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. అయితే ఈ ప్రశ్నలకు సమంత చేసిన లేటెస్ట్ ట్విట్ లో ఎటువంటి సమాధానాలు దొరకవు. ప్రస్తుతం సమంత శర్వానంద్ తో నటిస్తున్న ‘96’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉంది. 

ఈ షూటింగ్ గ్యాప్ లో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ తనను కలిసి చెపుతున్న కథలను వింటున్నప్పటికీ ఏ కథకు ఆమె తన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆమె ఈ మధ్య ఎక్కువ చెన్నైలో ఉంటూ ఒక వెబ్ సిరీస్ తీస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె చేతిలో అన్నపూర్ణ స్టూడియోస్ ఉండగా అది వదులుకుని చెన్నైలో షూటింగ్ ఎందుకు చేస్తోంది అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా స్క్రిప్ట్ ల కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఇలాంటి సినిమాలు తీయగల దర్శకుల వేటలో సమంత ఉంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: