హనుమంతుడు సంజీవనిని ఎవరి కోసం తీసుకొచ్చాడు? ఈ ప్రశ్నికి రామాయణం విన్న చిన్న పిల్లల్ని అడిగిన చటుక్కున చెప్పేస్తారు. కానీ ఇదే ప్రశ్నకు ఆప్షనాలు ఇచ్చినప్పటికీ  సమాధానం చెప్పలేకపోయింది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కేబికే  కార్యక్రమంలో అతిథిగా పాల్గొంది  సోనాక్షి.కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో జవాబు చెప్పలేక లైఫ్‌లైన్‌ వినియోగించుకుంది.   సోనాక్షి తీరు పట్ల బిగ్‌ బీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   

విూ  ఇంటికి రామాయణం అని పెట్టుకున్నారు. అన్నిటింకి మించి రాముడి సోదరుల్లో ఒకరి పైరైనా శత్రుఘ్న పేరును విూ తండ్రి పెట్టుకున్నాడు. అయినా నీకు ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా అని ఆశ్చర్యపోయారు.   అప్పటినుండి సోషల్‌ విూడియాలో నెటిజన్లు  సోనాక్షిని విపరీతంగ్రా ట్రోల్‌ చేస్తున్నారు. ఇది సోనాక్షి సిన్హాకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.    ఇదే  క్రమంలో ఉత్తరప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా   సోనాక్షిని ధన పశువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'ఆధునిక కాలంలో ఇలాంటి జనాలు కేవలం డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు. డబ్బు సంపాదించడం.. దాన్ని కూడా తమ కోసమే ఖర్చు పెట్టడం గురించి మాత్రమే వీళ్లు ఆలోచిస్తారు. ఇలాంటి వారికి చరిత్ర గురించి కానీ,  భగవంతుడి గురించి కానీ ఎలాంటి అవగాహన ఉండదు. తెలుసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయరు.

వీరంతా ధన పశువులు అని వీరిని చూసి చింతించడం తప్ప ఏం చేయలేం' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి వారు డబ్బు కోసమే ఆలోచిస్తారని... మంచి విషయాలను నేర్చుకోరని మండిపడ్డారు. ఒక స్టార్ అయ్యుండి మన పురాణాలూ, దేవుళ్ల గురించి కూడా తెలుసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై సోనాక్షి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: