తెలుగు లో ఈ మద్య బాలీవుడ్ హీరోయిన్లు బాగా సత్తా చాటుతున్నారు.  అయితే ఒకటీ రెండు హిట్స్ రాగానే తిరిగి బాలీవుడ్ వెళ్లిపోతున్న ఈ హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తున్నారు. హీరోయిన్స్ అనగానే ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు రావడం..పాత హీరోయిన్లకు చెక్ పెట్టడం జరుగుతుంది.  కొంత మంది హీరోయిన్లు మాత్రమే లాంటి పిరియడ్ కొనసాగుతున్నారు. 

అలాంటి వారిలో నయనతార,కాజల్,సమంత, త్రిష లాంటి హీరోయిన్స్ పదేళ్లు దాటినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.  వారి తర్వాత వచ్చిన హీరోయిన్లు కంటికి కూడా కనిపించకుండా పోయారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి విజయాలు అందుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.  ఈ అమ్మడు నటించిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) మంచి హిట్ కావడంతో ఇప్పుడు పారితోషికం పెంచే పనిలో పడిందట.

వాస్తవానికి  ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా ఒకప్పుడు శ్రీదేవి, శోభన్ బాబు సాంగ్ ‘వెల్లువొచ్చె గోదారమ్మ’ సాంగ్ తో మంచి ఫేమ్ అయ్యింది. ఈ ఏడాది మహర్షి సినిమాతో హిట్ కొట్టిన పూజ, రీసెంట్ గా హిట్టైన గద్దలకొండ గణేష్ చిత్రంలో చిన్న పాత్రైనా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాజల్, తమన్నా, రకుల్ వంటి వారు సీనియర్ హీరోలకు ఫిక్స్ అయిపోయారు. సమంత చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పూజ హెగ్డే లాంటి వారు తమకున్న డిమాండ్ ను ఫుల్లుగా వాడుకుంటున్నారు. అదీ సంగతి. ఈ నేపథ్యంలో  పూజ హెగ్డే లాంటి వారు తమకున్న డిమాండ్ ను ఫుల్లుగా వాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: