తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికి 50 రోజులు దాటిపోయింది.  ప్రస్తుతం ఎనిమిదవ  వారం దాటి తొమ్మిదవ వారంలోకి అడుగు పెడుతుంది.  అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ సాఫీగా కూల్ కూల్ గా సాగిపోతుంది. ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకున్నా ఒక సమయానికి కలిసి పోతున్నారు. అయితే ఇతర భాషల్లో వస్తున్న ముఖ్యంగా కోలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ చాలా కాంట్రవర్సీలతో నడుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ రేటింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు తెలుగు లో బిగ్ బాస్ కొత్త స్టాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. 

ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి హేమ,జాఫర్,తమన్నా,రోహిణి,అర్షూ,అలి రజా,హిమజ ఎలిమినేట్ అయ్యారు.  అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన శిల్పా చక్రవర్తి కూడా రెండు వారాలు ఉండి ఎలిమినేట్ అయ్యింది. మొన్నటి ఆదివారం నటి హిమజ ఎలిమినేట్ అయ్యింది.  తాజాగా ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అలీ రజా వస్తున్నారు.  అయితే మొన్నటి వరకు అన్నదమ్ముళ్లా ఉన్న rahul NEW' target='_blank' title='click here to read more'>రాహుల్, వరుణ్ సందేష్ ల మద్య పెద్ద గొడవనే సృష్టించాడు..ఇదే సమయంలో అలీ రెజా ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపబోతున్నాడు..దీన్ని బట్టి ఇక జరిగే ఐదు వారాల్లో కాస్త సీరియస్ ఆట మొదలుబెట్టబోతున్నట్లు కనిపిస్తుంది.   

అయితే  ‘రాహుల్‌- వరుణ్‌ల ఫ్రెండ్‌షిప్‌ ఇంతేనా..?’ అని పునర్నవి షాక్‌కు గురయింది. అయితే ఇదంతా ఉత్తుత్తే అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి నిజంగానే వారిద్దరూ గొడవపడ్డారా? లేక ఇది బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్కా? అన్న ప్రశ్న ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇంత సీరియస్ గా ఇంటి సభ్యుల మద్య ఎప్పుడూ గొడవ కాలేదు..ఆ మద్య మహేష్, వరుణ్ మద్య గొడవ వచ్చినా తర్వాత  బాగానే కలిసిపోయారు. మరి రాహల్, వరుణ్ ల మద్య టాస్కా లేదా నిజంగా గొడవ అయ్యిందా అన్న దానికి  సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: