టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మితం అయిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ లోని అగ్ర నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై మెగా ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచింది. ఇక నిన్న రిలీజ్ అయిన మరొక ట్రైలర్, ఆ అంచనాలు మరింతగా పెంచింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు కేవలం మరొక ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా మొదలుకాకపోవడంపై కొందరు మెగాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని సైరా టీమ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాక అమితాబ్, 

నయనతార కూడా మధ్యలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని అందరూ భావించారు. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడంతో, కేవలం మరికొద్దిరోజులు మాత్రమే సినిమాకు గడువు ఉందని, ఇప్పుడు సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోతే, రేపు అది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వారు వాపోన్నారట. నిజానికి నిర్మాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్స్ విషయమై ఎందుకని నెమ్మదిగా వ్యవహరిస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. మరి ఇకనుండి అయినా సైరా టీమ్ తమ సినిమా ప్రమోషన్స్ మొదలెడుతుందేమో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: