టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి..తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది.  టాలీవుడ్ లో ఆమెను లేడీ అమితాబ్ అని పిలుస్తారు.  హీరోయిన్ గా తన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్న విజయశాంతి లేడీ ఒరియెంటెడ్ పాత్రల్లో నటించడం వల్ల ఎక్కువ అవకాశాలు రాకుండా పోయాయి.  దాంతో ఆమె చూపు పాలిటిక్స్ పై పడింది.  అదే సమయంలో బీజేపీలో చేరిన ఆమె కొంత కాలానికే తల్లితెలంగాణ పార్టీ స్థాపించింది. 

ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం బీభత్సంగా సాగుతుంది.  కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ లో తల్లితెలంగాణ పార్టీ విలీనం చేసింది. పార్టీలో కిలక వ్యక్తిగా మారిన విజయశాంతి మెదక్ ఎంపిగా పనిచేశారు.  తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.  విజయశాంతి పార్టీలో ఉన్న సమయంలో సినిమాల్లో నటింపజేయడానికి ఎంతో మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు.  ఆమె సహనటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు.  కానీ విజయశాంతి మాత్రం ససేమిరా అంటూ వచ్చింది.   కానీ యువ దర్శకుడు అనీల్ రావిపూడి ఏం మంత్రం వేశాడో కాదే.. మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించేలా చేశారు. 

అదీ కాక గతంలో మహేష్ బాబు తో నటించిన అభిమానంతో విజయశాంతి మళ్లీ వెండి తెరపై కనిపించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.  అయితే షూటింగ్‌లో విజయశాంతి నటన చూసి ఫిదా అయిపోయిన అనీల్ రావిపూడి తన తదుపరి మూవీలో ఓ మంచి పాత్రలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని రాములమ్మ దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సంవత్సరం వెంకటేష్, వరుణ్ తేజ్ టించిన ఎఫ్ 2 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ సినిమాలోనే ఓ కీలక పాత్రలో విజయశాంతి నటించమని కోరాడట. అయితే ఎఫ్‌-2 సినిమాలో దాదాపు అన్నీ కామెడీ పాత్రలో ఉన్నాయ్.. మరి ఎఫ్-3లో కామెడీ పాత్రలుంటేనే సక్సెస్ అవుతుంది..దాంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఈ విషయం పై అఫిషియల్ గా ఇంకా ప్రకటన రాలేదు..వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: