మెగా హీరో  వరుణ్ తేజ్ నటించిన  లేటెస్ట్ మూవీ గద్దల కొండ  గణేష్  క్రిటిక్స్  దగ్గర్నుండి పాజిటివ్ రివ్యూస్ ను  రాబట్టుకొని  మొదటి   మూడు రోజులు  అద్భుతమైన వసూళ్ల తో సత్తా చాటగా ఆ తరువాత వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోమవారం కూడా అదే జోరును  కొనసాగించింది.  అయితే మంగళవారం నుండి  ఈ చిత్రం యొక్క కలెక్షన్స్  భారీగా డ్రాప్ అయ్యాయి.  ప్రస్తుతం  తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులనుండి  భారీ వర్షాలు  కురుస్తుండడంతో   ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల ఫై పడింది. దాంతో  ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది.



ఇక  ఈచిత్రం వారం రోజుల్లో  ప్రపంచ వ్యాప్తంగా  20కోట్ల షేర్ ను రాబట్టగా  తెలుగు రాష్ట్రాల్లో  17.40కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది.  అయితే అక్టోబర్ 2న  మెగాస్టార్ చిరంజీవి నటించిన మచ్ అవైటెడ్ మూవీ  సైరా  విడుదలకానున్న నేపథ్యంలో  ఈ వారం ఈచిత్రానికి  కీలకం కానుంది.  ఇక  ఓవర్సీస్ లో మాత్రం కేవలం 1.50కోట్ల గ్రాస్ ను రాబట్టి  ఈ చిత్రం డిజాస్టర్  అనిపించుకుంది. 



కోలీవుడ్ సూపర్ హిట్  గ్యాంగ్ స్టార్ డ్రామా 'జిగర్తండా' కు రీమేక్ గా హరీష్  శంకర్  తెరకెక్కించిన  ఈచిత్రంలో  బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్,  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ హీరో అథర్వ మురళి నటించారు. 14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మించిన  ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం  చిత్ర యూనిట్  తెలుగు రాష్ట్రాల్లో  విజయయాత్రను  నిర్వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: