టాలీవుడ్ లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ లో నటించిన ప్రభాస్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అప్పటి నుంచి ప్రభాస్ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ హిరోయిన్ గా నటించిన ‘సాహెూ’ రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలు మాత్రం చేరుకోలేక పోయింది. ఈ మూవీ తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో ఈ మూవీపై మొదటి నుంచి మంచి ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన హీరో, హీరోయిన్లు తమ కష్టానికి ఫలితం పొందారు. 

బాలీవుడ్ లో ‘సాహెూ’ మంచి రిజల్ట్స్ సాధించింది..120 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జాన్’సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీ యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు పలు గ్లామర్ పాత్రల్లో నటించిన పూజా హెగ్డే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్ పాత్రలో నటిస్తుందట. జాన్ సినిమాలో పూజా హెగ్దే స్కూల్ టీచర్‌గా భిన్న పాత్రలో నటిస్తుందట.  ఈమె స్కూల్ టీచర్‌గా ఉండగా.. ప్రభాస్‌కు పరిచయం అవుతుందని అలా ప్రేమలో పడ్డ వీరి జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎదురువుతాయో సినిమాలో చూపించబోతున్నారట.

1960 కాలంలో యూరప్‌లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని రాధాకృష్ణ రూపొందిస్తున్నారు.  ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా జగపతి బాబు నటిస్తున్నారు.  గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి ముందే ఇదీ స్టోరీ అంటూ పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మరో విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: