టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ నీ టార్గెట్ చేసుకొని చాలా మంది నిర్మాతలు స్టార్ హీరోలు సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఈ సీజన్లో సినిమా కనుక హిట్ అయితే కచ్చితంగా సదరు హీరో మరియు నిర్మాత పంట పండినట్లే. లాభాలు అంతగా వస్తాయి సంక్రాంతి సీజన్ కి విడుదలయ్యే సినిమా హిట్టయితే. అయితే రాబోయే సంక్రాంతికి ఇప్పటి నుండే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తమ సినిమా రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు వచ్చే సంక్రాంతి బరిలో విడుదలయ్యే సినిమాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.


కాగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా తో అద్భుతమైన హిట్ అందుకున్నాడు ఇటీవల. మార్చి సినిమా విడుదల కాకముందే భరత్ అనే నేను తో అలరించిన మహేష్ బాబు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు దక్కించుకోవడం తో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని డిసైడ్ అయిపోయాడు. మరోపక్క 'నా పేరు సూర్య' వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత గతంలో తనకు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 'అల వైకుంఠపురంబులో' అనే సినిమా చేస్తున్నాడు బన్నీ.


దీంతో ఈ సినిమాతో ఎలాగైనా త్రివిక్రమ్ తన కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ సినిమా కూడా రాబోయే సంక్రాంతి సీజన్ లోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కూడా విడుదల కానుంది. దీంతో రాబోయే సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసే విధంగా గట్టిపోటీ ఉన్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే మహేష్ - బన్నీ ప్రమోషన్స్ లో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. టీజర్ లో మహేష్ ముందుంటే సాంగ్స్ లో  బన్నీ ముందున్నాడు. మరి రాబోయే సంక్రాంతి బరిలో గెలిచేది ఎవరో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: