టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతిపెద్ద కాంబినేషన్ల‌లో రాజ‌మౌళి - మ‌హేష్‌, రాజ‌మౌళి - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉన్నాయి. ప‌వ‌న్ ప్ర‌స్తుం పాలిటిక్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెడితే రాజ‌మౌళి - మ‌హేష్ కాంబినేష‌న్ కోసం దాదాపుగా 16 ఏళ్లుగా ఇండ‌స్ట్రీ జ‌నాలు, రాజ‌మౌళి, మ‌హేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. స‌గ‌టు సినీ అభిమాని సైతం వీరి కాంబోలో ఎప్పుడు ?  సినిమా వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ‌తో ఉన్నారు.


రాజ‌మౌళి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా చేసిన‌ప్ప‌టి నుంచే రాజమౌళి - మ‌హేష్ కాంబినేష‌న్ సినిమా వార్త‌లు వ‌స్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కేఎల్‌.నారాయ‌ణ వీరి కాంబోలో సినిమా కోసం వీరిద్ద‌రికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఎవ‌రి బీజీలో వాళ్లు ఉండ‌డంతో ఈ కాంబోలో సినిమా సెట్ కావ‌డం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటికి చేసింది,ఆర్ ఆర్ ఆర్ తో కలిపి 12 చిత్రాలు మాత్రమే.


వీటిలో అత్యధికంగా నాలుగు ఎన్టీఆర్ తో, మూడు ప్రభాస్ తో, రెండు రామ్ చరణ్ తోచేయగా, సునీల్,నాని, రవితేజ, నితిన్ లతో తలో ఒక మూవీ చేశారు. ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా త‌ర్వాత చేసే సినిమా మ‌హేష్‌బాబుతోనే ఉంటుంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడని వార్త.


ఈ క‌థ జేమ్స్‌బాండ్ త‌ర‌హా సినిమాల స్టైల్లో ఉంటుంద‌ని అంటున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: