గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ లోకి అనూహ్యంగా ఆలీ రీ ఎంట్రీ ఇచ్చాడు. స్ట్రాంగ్ కంటెండర్ అయిన ఆలీ రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అయితే రీ ఎంట్రీని బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ గా పరిగణించాడు. అయితే ఆలీ రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఒక్కో ఇంటి సభ్యుడు ఒక్కో రకంగా స్పందించాడు. ఆ స్పందనలని బట్టి ఈ రీ ఎంట్రీ ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేదని ఇట్టే అర్థమైపోయింది.


ముందుగా  ఆలీ రీ ఎంట్రీ తో వరుణ్, రాహుల్, పునర్నవి, వితికా లు పెద్దగా సంతోషించినట్టు కనబడలేదు. ఆలీ వస్తున్నాడని తెలిసిన చాలా సేపటి వరకు వీళ్ళు గార్డెన్ ఏరియాలో కనిపించలేదు. మిగతా కంటెస్టెంట్స్ డాన్స్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఊరుకున్నారు. వీళ్ళు అలా ఉండడానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న మొదలైంది.


అయితే రాహుల్ కి వరుణ్ కి ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలుసు. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న వీరు సడెన్ గా ఇలా శత్రువులుగా మారడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఆ గొడవ కారణంగా రాహుల్, పునర్నవి లు ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు. అలాగే వరుణ్, వితికాలు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఆ గొడవ ప్రభావం ఇంకా మనసులో ఉండటం వల్ల వాళ్ళు  ఎక్కువగా కలుసుకోలేకపొయారని అంటున్నారు.


ఇక మిగతా కంటెస్టెంట్స్ లో శ్రీముఖి, శివజ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి సంతోషంతో అరిచి గోల చేసింది. శివజ్యోతితో పాటు రవి కూడా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మహేష్, బాబా భాస్కర్ కూడా ఆలీ రాకతో సంతోషంగానే ఉన్నట్టు కనిపించారు. ఆలీ రీ ఎంట్రీ ఇంటి సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: