ఆరోగ్యం క్షీణించాక రూపురేఖలు మారిపోవడం గమనిస్తూనే ఉంటాం. హాస్య నటుడు వేణు మాధవ్ అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.ఆయన చివరి సరిగా దిగిన ఫోటోని చూసి అభిమానులు బాధపడుతున్నారు.గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీలు కూడా చెడిపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.కాగా వేణు మాధవ్‌తో ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 
చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ చంద్రబాబులతో పాటు కమెడియన్లు, సీనియర్ నటీ నటులు, రాజీకీయ సినీ రంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా వేణు మాధవ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ హీరో, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.

 వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటన్నారు రాజశేఖర్. ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా వేణు మాధవ్ తనకు మంచి స్నేహితుడన్నారు. వరుసలు పెట్టి పిలుచుకునేంత చనువు అతనితో ఉందని.. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలుస్తూ ఎంతో  ఆప్యాయంగా ఉండేవాడన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం ఆయన సరే  వేణు వెంటనే స్పందించేవారు. ఆయనకు హెల్త్ బాలేకపోయినప్పటికీ ఇటీవల జరిగిన మా ఎన్నికల్లోనూ పోటీ చేసి ఈసీ మెంబర్‌గా గెలుపొందారన్నారు. 

సాటి కళాకారులకు సాయం చేయాలని తపన పడే వేణు మాధవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఇండస్ట్రీ కి తీరని లోటు.తరచుగా ఫోన్ చేసి మాట్లాడేవాడని.. ప్రతి పండక్కి వేణు మాధవ్ ఫోన్ చేసి మరీ విషెష్ చేసేవాడు. అయితే వారం రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్‌కి వెళ్లి కలిశాను.. ఆయన కోలుకుని సోమవారం సాయంత్రం డిశార్జ్‌ అయ్యారు. అప్పుడు చాలా యాక్టివ్‌గానే పలకరించారు. అనుకోకుండా మళ్లీ మళ్లీ ఆయనకు సీరియస్ అవడంతో   మంగళవారం హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యారని అన్నారు.

మళ్ళి కోలుకొని మాములుగా తిరిగి వస్తదనుకుంటే ఇలా  తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ వేణు మాధవ్‌తో చివరిగా దిగిన ఫొటోను షేర్ చేశారు రాజశేఖర్.రాజశేఖర్ షేర్ చేసిన ఫొటోలో హాస్పటల్ బెడ్ పై రూపు రేఖలు మారిపోయి  అసలు గుర్తు పట్టలేనంగా ఉన్నారు వేణు మాధవ్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: