ఇటీవల కాలంలో ఇండియాలో బయోపిక్ సినిమాలు వరసగా వస్తున్నాయి. బయోపిక్ సినిమాలకు దేశంలో మంచి డిమాండ్ ఉన్నది.  రాజకీయ నాయకులకు, స్పోర్ట్స్ పర్సన్స్ జీవితం ఆధారంగా వచ్చే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత  జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కబోతుంది.  


జయలలిత జీవితం ఆధారంగా నాలుగు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఈ నాలుగు బయోపిక్ లలో ఒకటి నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తుంటే మరొక  సినిమాలో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  కంగనా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాకు సంబంధించిన మేకప్ టెస్ట్ అమెరికాలోని హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్నది.  


కాగా, కంగనా తో పాటు నిత్యామీనన్ హీరోయిన్ గా ఐరెన్ లేడి పేరుతో బయోపిక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  నిత్యా మీనన్ కు సంబంధించిన ఓ ఊహా చిత్రాన్ని ఇటీవలే రిలీజ్ చేశారు.  జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎలా ఉన్నది అనే విషయాన్నీ ఆధారంగా చేసుకొని ఊహా చిత్రాన్ని తయారు చేశారు.  నిత్యామీనన్ ఇంచుమించుగా జయలలితలానే కనిపించింది.  ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయే విధంగా ఉన్నది.  


మేకప్ టెస్ట్ పర్ఫెక్ట్ గా ఉండటంతో మిగతా విషయాలపై యూనిట్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.  త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  అయితే, సినిమాను ఎలా తీయబోతున్నారు.  ఎలాంటి కథనాలు ఉండబోతున్నాయి అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకేసారి నాలుగు బయోపిక్ లు రాబోతుండటంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  2021 లో ఎన్నికలు రాబోతున్న సమయంలో జయలలిత బయోపిక్ కు ఆదరణ లభిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: