టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెళ్లి తరువాత కూడా సక్సెఫుల్ కెరీర్ లీడ్ చేస్తుంది సమంత అక్కినేని.ఒక స్టార్ హీరోయిన్‌గా సినిమాలతో పాటు, యాడ్స్ లో మోడల్ గా తన జీవితం సాఫీగా సాగిపోతోంది.
 ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన ఆడిపాడిన సమంత.. వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా సమంత చేసిన ఓ పోస్ట్, దాని ద్వారా వ్యక్తపరిచిన సందేశం నెట్టింట వైరల్ అవుతోంది.సినిమాలతో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ వేదికలపైనా సమంత చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానిలకి దగ్గరగానే ఉంటుంది .ఎప్పటికప్పుడు అక్కినేని ఫ్యామిలీ సంగతులు, తన సినిమా విశేషాలు పంచుకుంటూ, తన ఫిట్నెస్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
 
అందుకే నెట్టింట కూడా సమంతకు విపరీతమైన ఫాలోయింగ్.  పోస్ట్ పెట్టిందంటే చాలు అది వైరల్ కావాల్సిందే అనేలా ఉంటాయి సమంత పెట్టె పోస్ట్లు.అలాంటి సమంత తాజాగా ఓ పోస్ట్ పెట్టి అందరిలో  అనుమానాలు రేకెత్తించింది.''గతంలో తగిలిన తీవ్ర గాయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే ఎంతో ఓదార్పు దొరుకుతుంది. అక్కడ నిన్ను నువ్వు గుర్తించగలవు. అప్పుడే నీకు అసలైన మనశ్శాంతి లభిస్తుంది'' అని పేర్కొంటూ తన ఫొటో జత చేసింది సమంత. దీంతో ఈ పోస్ట్ చర్చనీయాంశం అయింది.సమంత చేసిన ఈ పోస్ట్ చూసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏంటి.. సమంత ఇలా అంటోంది..? గతంలో సమంతకు ఏదైనా చెప్పుకోలేని కష్టం వచ్చిందా ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 నిజంగానే సమంత మనస్సును ఏదో తెలియని గాయం వెంటాడుతోందని, అందుకే ఇలాంటి సందేశం ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు ఫాలోవర్స్.మరి గతంలో సమంతకు తగిలిన గాయం ఏంటి? ఆమె పోస్ట్ కి అర్ధం ఏంటి అని వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు.లేదంటే  ఈ పోస్ట్ జనంలో మేల్కొలుపు తీసుకు రావడానికా? లేక తనకు తగిలిన గాయం గురించి వ్యక్త పరచడానికా? అనేది మాత్రం క్లారిటీ లేదు.
 
ఇటీవలే ఓ బేబీ రూపంలో సూపర్ సక్సెస్ సాధించిన సమంత మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్ లో సూపర్ హిట్ ఆయన ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇక మరోవైపు పెరుగుతున్న ఆధునికతను క్యాచ్ చేసుకునేలా ఓ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిందనేది తాజా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: