తెలుగు ఇండస్ట్రీలో  లేడీ అమితాబ్ గా పేరుగాంచింది సీనియర్ నటి విజయశాంతి.మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు 26వ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.ఈ వార్తతో  తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి మొదలైంది.ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. 

మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది విజయశాంతి.మళ్ళి ఇన్నాళ్లకు ఆమె తిరిగి వెండితెరపై అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది . 
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన విజయశాంతి.. పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా కళ్ళు చెదిరే పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా  అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే మరో సినిమాకి ఓకే చేసిందనే ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 'ఎఫ్ 2' తో గ్రాండ్ సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఆ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట.ఎఫ్ 2  సీక్వెల్ లో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా  ఆ పాత్ర చేయడానికి ఆమె ఆసక్తి చూపిందని సమాచారం. ఈ వార్త తో  విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని  అర్థమవుతోంది. ఇక మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరూ లో  అనిల్ రావిపూడి మార్క్  కామెడీ పార్ట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. 

ముఖ్యంగా ఈ సినిమాలో కాశ్మీర్ టు ఆంధ్ర ట్రైన్ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకోనుందని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ పండించిన రష్మిక మందన్న ఈ మూవీ లో
మహేష్ తో రొమాన్స్‌ చేయబోతోంది.వీరిద్దరి మధ్య రొమాన్స్ కి  ప్రియారిటీ ఇస్తూ కొన్ని సన్నివేశాలు హై లెవెల్‌లో ఉండనున్నాయని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' కోసం సూపర్ స్టార్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. 


    మరింత సమాచారం తెలుసుకోండి: