టాలీవుడ్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన అనుష్క శెట్టి తర్వాత టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర దర్శకులు అనుష్కతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమా మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఆమె ఏ సినిమాలో నటించలేదు. 

ఆ మద్య మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఆమె ఇంతకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్టార్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం సినిమాలో నటించడానికి ఏ నటుడైనా ఎంతో ఇష్టపడతారు. అనుష్క  ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే బహు భాషా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ అయిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో నటించబోతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.  కానీ అందరికీ ముఖ్యంగా మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్ కి అనుష్క షాక్ ఇచ్చింది.

కారణం కాల్షీట్ల సమస్య అని అందరూ భావించినా..ఆ కారణం కానే కాదట.  ఈ సినిమాకి తమిళ లెజండరీ లిరిసిస్ట్ వైరముత్తు పాటలు రాయడమేనని సమాచారం. వైరముత్తు మీద గతేడాది పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చాయి.  ప్రముఖ సింగర్ చిన్మయి.. వైరముత్తు తనను ఎలా వేధించాడో బయటపెట్టింది. ఆమె బయట పడడంతో చాలామంది ఆమెతో గొంతు కలిపారు..అందులో అనుష్క కూడా ఉంది. వైరముత్తుకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిపై చర్యలు తీసుకోవడం లేదు.

అయినప్పటికీ చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు..ఆమెకు చాలా మంది నటీమణులు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే మణిరత్నం తన కొత్త సినిమాలో మొత్తం పాటలు రాసే బాధ్యత వైరముత్తుకి అప్పగించారు. దీంతో  అనుష్క- చిన్మయికి మద్దతుగా.. వైరముత్తుకు వ్యతిరేకంగా మణిరత్నం సినిమా నుంచి తప్పుకుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: