సూపర్ స్టార్ మహేష్ బాబు- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈక్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది ఈ చిత్రం. ఇప్పటికే ఆంధ్రా లో కొన్నిచోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఈచిత్రం ఓవర్సీస్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైయ్యాయి. మహేష్ కు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉండడం దానికి తోడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిచేసిన ఎఫ్ 2 ఈఏడాది ప్రారంభం లో విడుదలై అక్కడ భారీ గా కలెక్షన్స్ రాబట్టడంతో సరిలేరు నీకెవ్వరు ఓవర్సీస్ హక్కులను 15కోట్లకు అమ్మాలని నిర్ణయించారు ఈ చిత్ర నిర్మాతలు.
అయితే తాజా సమాచారం ప్రకారం 13.5కోట్లకు ఈడీల్ క్లోజ్ అయిపోయిందట. గతంలో మహేష్ నటించిన పోకిరి , బిజినెస్ మేన్, మహర్షి చిత్రాలను ఓవర్సీస్ లో విడుదలచేసిన గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ ఈసినిమా ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ లెక్కన సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కావాలంటే 3మిలియన్ల కు పైగా వసూళ్లను రాబట్టాలి. మరి ఈచిత్రం ఆమార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి 13ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈచిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి11 న ఈచిత్రం విడుదలకానుంది.