ఈ సారి 2020 సంక్రాంతికి భారీ సినిమాలు ఢీ కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ జనవరి 10న, 11న మహేష్ 'సరిలేరు', 12న బన్నీ 'అల' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ సినిమా ఉండగా ఇప్పుడు విశాల్ కూడా వచ్చి దూరిపోయాడు.
 ఇక ఈ విషయంలో లోలోపల చాలా డిస్కర్షన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. మా సినిమాని 11న రిలీజ్ చేస్తామని, మీ సినిమాని 14న రిలీజ్ చేయమని మహేష్ సినిమా నిర్మాతలు బన్నీ సినిమా నిర్మాతలకు ప్రతిపాదన పంపినట్లు తాజా సమాచారం. కానీ బన్నీ సినిమా యూనిట్ వైపు నుంచి తమ సినిమా 12న విడుదల అనే మాట మీదే గట్టిగా ఉంది.

అందుకే తమ సినిమా 14న రిలీజ్ చేద్దామని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిపాదించినట్లు గాసిప్ వచ్చింది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బన్నీ సినిమా విడుదల రోజు మహేష్ సినిమా కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో రెండో ఆలోచన లేకుండా డిసైడ్ అయిపోయారని వినిపిస్తోంది. బన్నీ సినిమా యూనిట్ కూడా నో ప్రాబ్లం అన్నట్టుగా ఉన్నారట.

అందుకే బన్నీ యూనిట్ వెనక్కు తగ్గే ఆలోచన లేదని తెలుస్తోంది. ఇక దీని మీద ఖచ్చితంగా క్లారిటి రావాలంటే డిసెంబర్ ఆఖరు వారం వరకు ఆగాల్సిందే. ఇక రెండు సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నాయి. బన్నీ-త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 10 నాటికి టాకీ మొత్తం పూర్తి చేసుకుంటుందని లేటెస్ట్ న్యూస్. అలాగే మహేష్-అనిల్ రావిపూడి సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ కాపీ రెడీ కావడంలో మహేష్ సినిమానే ముందు వుంటుందని తెలుస్తోంది. ఒక్క రజనీకాంత్ సినిమా తప్ప మిగిలిన సినిమాలు మహేష్-బన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్సయ్యాకే తమ రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకోవాలని వేచి చూస్తున్నట్టుగా ఆయా చిత్ర బృందాల నుండి అందిన సమాచారం. ఇక ఒకవేళ బాలయ్య గనక ఆ సమయానికి రెడీ అయితే మాత్రం సంక్రాంతి మామూలుగా ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: