మిగతా ఇండస్ట్రీలలో సంగతి ఏమోగానీ..సినిమా ఇండస్ట్రీలో సాయం చేసే చేతులు తక్కువన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్స్, హీరోల విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. వరుస ఫ్లాపులొచ్చిన హీరోలకి, అలాగే వరుస ఫ్లాపులిచ్చిన డైరెక్టర్స్ కి నిర్మాతలు మళ్ళీ సినిమా ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొహం చాటేస్తారు అనొచ్చు. అయితే అక్కడక్కడా కొంతమంది తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తు తమకున్న దాంట్లోనే కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి తాపత్రయపడుతుంటారు. ఇప్పుడు మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తీసుకున్న ఇలాంటి ఒక డెసిషన్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచిపింజేస్తుంది.  

పాతిక వేలతో ఇండస్ట్రీకొచ్చిన పూరి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా బద్రి తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దాంతో అందరి నోటా పూరి గురించే. వరుసగా సినిమాలు చేస్తు అతి తక్కువ కాలంలోనే 100 కోట్లు సంపాదించాడు. ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు సంపాదించనంత ఆస్తులను సంపాదించుకున్నాడు. అయితే నమ్మినవాళ్ళు దెబ్బ తీయడంతో అన్ని పోగొట్టుకొని ఒంటరి అయ్యాడు. ఆ సమయంలో ప్రముఖ నటుడు ఆలీ, తన గురువు రాం గోపాల్ వర్మ సహాయంతో కాస్త ఊరట లభించింది. మళ్ళీ తిరిగి తన మార్క్ తో సినిమాలు తీసి దాదాపు రికవర్ అయ్యాడు. ఇక గత కొంతలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ అందుకోవడమే కాదు కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు డబ్బు కూడా బాగా వచ్చింది. దాంతో ఇప్పుడు పూరి ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకొని స్మూత్ గా అందరికి షాకిచ్చాడు. 

ఇస్మార్ట్ శంకర్ సక్సస్ తో వచ్చిన డబ్బుతో గతంలో ఒకటో రెండో సినిమాలు తీసి, ప్రస్తుతం చేతిలో పనిలేకుండా, డబ్బులు కూడా లేకుండా వున్న కొంతమంది డైరక్టర్లకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పూరి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఇరవై మంది డైరక్టర్లు, కో డైరక్టర్లు కు చిన్నపాటిసాయం అందిస్తానని, సినిమాల నుంచి తమకు ఆదాయం వస్తున్నంతకాలం ఇలా చేస్తూనే ఉంటానని పూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఎప్పటి నుంచో పూరి ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ గారికి ప్రతి నెల తన అకౌంట్ కు డబ్బు పంపుతున్న సంగతి చాలాసార్లు రమాప్రభ గారే చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: