టాలీవుడ్ ప్రముఖ కామెడియన్లలో ఒకరైన వేణుమాధవ్ గారు మూడు రోజుల క్రితం కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. సంప్రదాయం అనే సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు మాధవ్, అంతకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా పని చేసారు. అయితే సినిమా అవకాశాలు రావడం మొదలైన తరువాత, వాటిని మెల్లగా అందిపుచ్చుకుని తన ఆకట్టుకునే కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో వేణుమాధవ్ మంచి స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇక వేణుమాధవ్ అకాల మరణ వార్త టాలీవుడ్ లోని ఎందరినో కృంగదీసింది అనే చెప్పాలి. 

స్వతహాగా ఎంతో సౌమ్యుడు మరియు ఇతరులకు సాయం చేసే అలవాటున్న వేణుమాధవ్ గురించి, ప్రముఖ తెలుగు యాంకర్ ఉదయ భాను ఒక విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టారు. వేణుమాధవ్ గారితో తాను ఇదివరకు రెండు షోల్లో పని చేసానని, అయితే ఆ షో ల షూటింగ్ సమయంలో తన ఆకట్టుకునే నటనతో కెమెరా ముందు అద్భుతంగా పెర్ఫర్మ్ చేసే వేణుగారు, మేకప్ తీసేసిన తరువాత చేసే సందడి అంతా ఇంతా కాదని, మొదటి నుండి తనను చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచే వేణుమాధవ్ గారు, తనకు జీవితంలో కష్టాలు ఎదురైన సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని, అలానే మనం బ్రతికి ఉన్నా, లేకపోయినా మన గురించి మాత్రం అందరూ మంచిగా చెప్పుకోవాలి అనేదే ఆయన భావన అని, అలానే జీవితం గురించి ఆశ్చర్యకరంగా ఎన్నో గొప్ప విషయాలు తనకు చెప్పేవారు అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. 

ఇక తమ షో షూటింగ్ అయిపోయిన తరువాత అందరం కలిసి ఎంతో ఆనందంగా భోజనం చేసేవాళ్లమని, ఇక షూటింగ్ మొత్తం ఎంతో ఆనందోత్సాహాలతో సాగేదని చెప్పారు. ఇక ఇటీవల తాను ఒకసారి వేణుమాధవ్ గారిని కలిసినపుడు ఆయన అనారోగ్యం విషయం తెలిసిందని, మీరు ఇకనైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని మేము కూడా గట్టిగా చెప్పడం జరిగిందని, అయితే ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే హఠాత్తుగా ఆయన మనల్ని వదిలి వెళ్లడం నిజంగా ఎంతో బాధాకరమని ఆమె కన్నీరుమున్నీరవుతూ చెప్పారు ఉదయ భాను. వారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాలని, అలానే వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు ఆమె చెప్పారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: