బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పైన  కృష్ణ జింక హత్య కేసు విచారణ  గత 20 సంవత్సరాలుగా సాగుతోంది.సెప్టెంబర్ 27 శుక్రవారం రోజున సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ కోర్టు లో హాజరు కావాల్సి ఉంది. ఈ సారి ఆయన కోర్టుకు హాజరు కాకపోతే  బెయిల్ ని రద్దు చేసే అవకాశం ఉందని కోర్టు ఆయనకు పోయినసారి వార్నింగ్ ఇచ్చింది.


ఇటివల సల్మాన్ ఖాన్ ను  చంపేస్తానంటూ  సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపుల కారణంగా మరియు షూటింగ్ లో చాలా బిజీ ఉండటం వల్ల ఆయన కోర్టుకు హాజరు కాలేకపోతున్నాడని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేశారు.1998 లో "హమ్ సాత్ సాత్ హై" సినిమా షూటింగ్ సమయంలో  కృష్ణ జింకను వేటాడి చంపారనే  ఆరోపణలు  సల్మాన్ ఖాన్ తో పాటు  టబు, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే   పైన వచ్చాయి. అయితే మిగిత వారిని "బెనిఫిట్ ఆఫ్ డౌట్ " కింద  విడిచి పెట్టారు.సల్మాన్ ఖాన్ కు కింది కోర్టు కృష్ణ జింక హత్య  కేసులో  5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయన ఈ తీర్పు ను సవాల్ చేస్తూ పై కోర్టు కు వెళ్ళారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బెయిల్  పైన ఉన్నారు.


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలో నటిస్తున్నాడు.   ప్రభు దేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా  హీరోయిన్ గా నటిస్తుంది  దబాంగ్ 3 లో విలన్ గా కన్నడ సూపర్ స్టార్  సుదిప్ నటిస్తున్నాడు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  డిసెంబర్ 20 విడుదల కానుంది. దబాంగ్ 3 సినిమాని తెలుగు భాషలో రిలీజ్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: