పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాథ పడుతున్నా ఆ నొప్పిని భరిస్తూనే పవన్ లేటెస్ట్ గా ఇద్దరు ప్రముఖ దర్శకులు చెప్పిన కథలు వినడం సంచలనంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ను ఈమధ్య ప్రముఖ తమిళ సంచలన దర్శకుడు హరి కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘సామి’ ‘యముడు’ ఇలాంటి పవర్ ఫుల్ సినిమాలను మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంలో పేరు గాంచిన హరి పవన్ కలిసి కథ చెప్పడంతో పవన్ ఇప్పుడు తన రూట్ మార్చి ఒక మాస్ సినిమా చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదేవిధంగా పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన ఒక స్టోరీ లైన్ ను డెవలప్ చేసి దర్శకుడు క్రిష్ ఈ మూవీ కథను పూర్తిగా పవన్ కు ఈ మధ్య కలిసి వినిపించాడు అని అంటున్నారు.

వాస్తవానికి పవన్ ఆరోగ్య రీత్యా ఆపరేషన్ చేయించు కోవడం మంచిదని కొందరు డాక్టర్స్ సూచిస్తున్నారని తెలుస్తోంది. అయితే పవన్ మనసు మాత్రం తన అనారోగ్య సమస్యకు ప్రకృతి వైద్యం మంచిది అని భావించి కేరళాకు చెందిన ఒక ప్రకృతి వైద్య డాక్టర్ తో పవన్ తన అనారోగ్య సమస్య నుండి బయటపడటానికి చర్చలు చేస్తున్నట్లు సమాచారం. 

దీనితో పవన్ తన అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకుంటూనే ఈ ఏడాది డిసెంబర్ ప్రాంతంలో లేకుంటే వచ్చే సంవత్సరం జనవరి నుండి తన సినిమాను మొదలు పెట్టాలి అన్న ఉద్దేశ్యంతోనే పవన్ తన వెన్ను నొప్పిని కూడ లెక్క చేయకుండా కథలు వింటున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ నిర్మాత ఏఎమ్ రత్నంల ఒత్తిడి పవన్ పై విపరీతంగా ఉంది అని అంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఒక్క పురపాలక పంచాయితీ సంస్థల ఎన్నికలు తప్ప దగ్గరలో మరేమీ ఎన్నికలు లేకపోవడంతో పవన్ తన ఆరోగ్యం పై శ్రద్ద పెడుతూ మంచి కథ కోసం తన అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: