యాక్షన్ హీరో గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య విడుదలకు సిద్దమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 29న వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ లో గ్రాండ్ గా జరుగనుంది. ఈ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ టీం ఆ వార్తలను కొట్టిపారేసింది. అవన్నీ రూమర్లు అని ఆయన ఆ ఈవెంట్ కు రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవల జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల బన్నీ హాజరు కాలేకపోయాడు.
అలాంటిది ఇప్పుడు చాణక్య ఈవెంట్ కు గనుక వస్తే మెగా అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడం ఖాయం. ప్రస్తుతం అల..వైకుంఠపురములో సినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో వున్నాడు బన్నీ. దాంతో కొన్ని రోజులు ఈ ఈవెంట్ లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సైరా కు పోటీగా గోపిచంద్ చాణక్య తో దసరా బరిలో నిలిచాడు. సైరా అక్టోబర్ 2 న విడుదలకానుండగా చాణక్య అక్టోబర్ 5న విడుదలకానుంది. అయితే తాజాగా విడుదలైన చాణక్య ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ ను చూసి గోపి ఫుల్ హ్యాపీ గా వున్నాడు. విజువల్స్ , భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ అదరహో అనిపించింది. మరి చూస్తుంటే ఈ సారి చాణక్యతో గోపిచంద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేలానే వున్నాడు. తమిళ డైరెక్టర్ తిరు తెరకెకెక్కించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించింది. గోపిచంద్ కెరీర్ లో నే సుమారు 40కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు.