బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్.. కార్తీక్ ఆర్యన్ లాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని స్టార్లు ఇప్పుడిప్పుడే లైమ్ లైట్ లోకి వచ్చి వెలుగులు విరజిమ్ముతున్నారు. ఆయుష్మాన్ - విక్కీ- కార్తీక్ ఇప్పటికే హీరోలుగా నిరూపించుకున్నారు.  వీళ్లంతా ఓ ప్రత్యేకమైన జోనర్ లో ఎంతో అభిరుచి ఉన్న కథల్ని ఎంచుకుంటూ పది మందికీ ఆదర్శంగా నిలుస్తుండడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. అయితే వీళ్ల అభిరుచి టాలీవుడ్ యువ హీరోలకు ఆదర్శం కానుందని తాజా ప్రయత్నాలు చెబుతున్నాయి.


బాలీవుడ్ లో హిట్టయిన సినిమాల్ని వెంటనే ఖాతాలోకి మళ్లించే మన అగ్ర నిర్మాతలు రీమేక్ హక్కుల్ని చేజిక్కించుకుని మన కుర్ర హీరోలతో తీస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు బడా నిర్మాతలు ఆ తరహా ప్రయత్నాల్లో ఉన్నారు. రాజ్ తరుణ్ హీరోగా ఆయుష్మాన్ నటించిన `డ్రీమ్ గాళ్` చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే బాటలో ఇప్పుడు ఫలక్ నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ కూడా వెళుతున్నారని తెలుస్తోంది.


 బాలీవుడ్ హిట్ చిత్రం 'డ్రీమ్ గాళ్'ను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలన్నది ఎప్పటి నుండో సురేష్‌ ప్రొడక్షన్స్‌ కోరికట. ఆ దిశగా గతంలోనూ చాలా ప్రయత్నాలు చేసింది కానీ, సాహసం చేయలేకపోయిందట. కానీ, ఇప్పుడు బేబీ ఇచ్చిన ఉత్సాహంతో ఆ రిస్క్‌ చేసేందుకు ఈ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందనీ తెలుస్తోంది. ఆల్రెడీ ఓ స్పెషల్‌ టీమ్‌ ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తోందట. త్వరలోనే స్క్రీప్టు పనులు ఓ కొలిక్కి రానున్నాయట. హీరోగా యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ని హోల్డ్‌ చేసి పెట్టిందట సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ.



మరింత సమాచారం తెలుసుకోండి: