తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక పాపులారిటీని తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. బాబుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా,  విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేస్సుకున్నాడు. రానా  ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించి చాలా రోజులైంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆయన సినిమాల్లో కనిపించింది చాలా తక్కువ. ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కించిన మహానాయకుడులో చంద్రబాబు పాత్రలో కనిపించాడు.


ఆ తర్వాత వెల్కమ్ టూ న్యూయార్క్ అనే హిందీ సినిమాలో కనిపించి తళుక్కుమన్నాడు. అయితే రానా ప్రస్తుతం "విరాట పర్వం, హాథీ మేరె సాథీ" అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. విరాట పర్వం అనే చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వేణు ఊడుగులు గతంలో నీది నాది ఒకే కథ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నక్సలైట్ల ఇతివృత్తంతీ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.


ఇకపోతే హాథీ మేరె సాథీ సినిమాలో రానా మావటి వాడిగా కనిపించనున్నాడట. ఆ సినిమా కోసమే రానా బరువు తగ్గాడని సమాచారం. అయితే అటు హీరోగా చేస్తూనే, అతిధి పాత్రల్లో కూడా మెరుస్తున్నాడు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 లో రానా నటించాడట. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. ఆ ట్రైలర్ లో రానాని ఎవరూ గుర్తు పట్టి ఉండరు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రానా రాక్షసుడి అవతారంలో కనిపించనున్నారట.


ఈ సినిమాలో రానా లుక్ భయంగొలిపేలా ఉంటుందట. రాక్షసుడిగా రానా నటన అందరిని భయపెట్టిస్తుందట. ఏదేమైనా రానా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించనున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టీబరు 27 వ తేదీన విడుదల అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: