‘సైరా’ ప్రమోషన్ కోసం ప్రస్తుతం ముంబాయిలో ఉన్న చిరంజీవి అక్కడి బాలీవుడ్ హీరోలకు షాక్ అయ్యేలా అనుసరిస్తున్న వ్యూహాలు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా చిరంజీవి ప్రస్తుతం ముంబాయిలో చాల బిజీగా ఉన్నాడు. 

ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి తమన్నాతో కలిసి ముంబాయిలోని కొన్ని కీలక ప్రాంతాలలోని రోడ్స్ జన్క్షన్స్ పై తమ ప్రచార వెహికల్ ను ఆపుకుని సామాన్యుల మధ్య కలిసిపోతు ‘సైరా’ గురించి అందరికీ తెలిసేలా చిరంజీవి ఈ మూవీని చాల గట్టిగా ముంబాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. 

చిరంజీవి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన వ్యక్తి అయినా ‘బాహుబలి’ తో తమన్నాకు ముంబాయి ప్రజలలో మంచి క్రేజ్ ఏర్పడటంతో సాధారణ ప్రజానీకం అంతా చిరంజీవి తమన్నాలను ఆసక్తిగా చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వీరిద్దరికీ బాలీవుడ్ ఘనస్వాగతం పలికింది అంటూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేసింది. 

ఇది ఇలా ఉండగా ‘సైరా’ హిందీ వెర్షన్ టిక్కెట్స్ ముంబాయిలో హాట్ కేక్ లా అమ్మకం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ మూవీని హిందీ ప్రాంత రాష్ట్రాలలో 1400 వందల ధియేటర్లలో విడుదల చేయాలని భావించి ఇప్పుడు ‘సైరా’ కు ఏర్పడిన మ్యానియాతో ఈ మూవీ ధియేటర్స్ సంఖ్యను 1800ల వరకు పెంచుతున్నట్లు టాక్. ఈ మూవీకి ప్రస్తుతం ఏర్పడిన మ్యానియాను పరిశీలిస్తున్న బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ‘బాహుబలి 2’ రికార్డులను అందుకోవడం పెద్ద కష్టం కాదు అని అంటున్నారు. అయితే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తెలుగు స్వాతంత్ర సమరయోధుడి కథకు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: