టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ, మోడల్ రకూల్ ప్రీత్ సింగ్.  ఈ మూవీ తర్వాత వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సూపర్ హిట్ కావడంతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో తనదైన దూకుడు కొనసాగిస్తుంది రకూల్ ప్రీత్ సింగ్. 

హైదరాబాద్ కి తన మకాం మార్చిన రకూల్ ఇక్కడ ఓ పెద్ద జిమ్ నిర్వహిస్తుంది.  ప్రస్తుతం తెలుగు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తమిళ, హిందీ సినీ పరిశ్రమలపై కన్నేసింది. తాజాగా ఈ బ్యూటీ 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే షోలో పాల్గొంది. మంచు లక్ష్మి హోస్ట్ చేస్తోన్న ఈ షోలో పలువురు సినీ తారలు తమ మనోగతాలు వ్యక్త పరుస్తున్నారు. ఈ సందర్భంగా  నీకు సెలబ్రిటీలలో ఎవరైనా క్రష్ ఉన్నారా..? అని మంచు లక్ష్మి ప్రశ్నించగా.. 'బాలీవుడ్ లో రణవీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని రకుల్ చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. 

ఈ షోలోసమంత, వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఇటీవల వారికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఇటీవల కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు 2' విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.  రకుల్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తోంది. కమల్ హాసన్ నటిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు.  ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో 'మర్జావా' అనే సినిమాలో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: