టాలీవుడ్ లో ఇటీవల కాలంలో వరుసగా పరభాష హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు.  తమిళ,మళియాళ,బాలీవుడ్ నుంచి పలువురు హీరోయిన్లు తెలుగు తరకు పరిచంయ అయ్యారు..ఈ నేపథ్యంలో జోద్ పూర్ నుంచి వచ్చిన పాయల్ రాజ్ పూత్ ‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేసింది.  అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో బోల్డ్ పాత్రలో నటించింది పాయల్ రాజ్ పూత్.  ఈ మూవీలో హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు..లాంగ్ లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లలో పాయల్ రాజ్ పూత్ పిచ్చెక్కించింది. 

ఒక్క మూవీతోనే తెలుగు దర్శక, నిర్మాతలను బాగానే ఆకట్టుకుంది.  తెలుగు లో వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి.  ప్రస్తుతం పాయల్ ''వెంకీ మామ'' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటిగా 'టైగర్ నాగేశ్వర్రావు' కనిపిస్తుంది.  బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. 1980 - 90 దశకాల్లో స్టూవర్ట్ పురం గజదొంగగా జనాలను భయపెట్టిన 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ ఇది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 

వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 'టైగర్ నాగేశ్వర్రావు'గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. అసలే వేశ్య పాత్ర  అందులోనూ పాయల్ రాజ్ పూత్ ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: