కాగా మలయాళ వెర్షన్ కు సూపర్ స్టార్ మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , తమన్నా ముఖ్య పాత్రల్లో నటించగా నయనతార కథానాయికగా నటించింది. భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ , ట్రైలర్లు సినిమా ఫై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఒక్క హిందీ లో తప్ప దాదాపుగా అన్ని భాషల్లో సోలో గా విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.