టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జియంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ జన్మదిన కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రో టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 

ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన హైలైట్స్ ఇవేనంటూ నేడు ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం, సినిమాలో మహేష్ బాబు పాత్ర రెండు విధాలుగా ఉంటుందట, మొదట్లో మేజర్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో దర్శనం ఇచ్చే మహేష్, సెకండ్ హాఫ్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ తో మాస్ స్టైల్ యాక్షన్ తో ఫ్యాన్స్ ని అలరిస్తారట. ఇక హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తోందని, అలానే ఆమె పాత్ర వచ్చినపుడు ప్రేక్షకుల్లో మంచి నవ్వులు పూస్తాయని అంటున్నారు. 

ఇక కమెడియన్ బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి పాత్రలు సినిమాలో చాలా బాగుంటాయని, అలానే విజయశాంతి ది సినిమాను మలుపు తిప్పే పవర్ ఫుల్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మంచి కథని, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో, అలానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ కాకుండా మహేష్ రేంజ్ కి సరిపోయే మాస్ అంశాలు కూడా మిళితం చేసి ఓవరాల్ గా ఈ సినిమాను ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు అనిల్. ఇక ఇన్నర్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత మంచి హిట్ అందుకోవడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే వచ్చే సంక్రాంతి సమయం వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: