ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తొలి సినిమాతో ప్రేక్షకులతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన కెరీర్ మూడవ సినిమాగా వచ్చిన వర్షం సినిమా, అత్యద్భుత విజయాన్ని అందుకుని ప్రభాస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడినుండి వరుసగా మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తుస్తూ వస్తున్న ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాల అద్భుత విజయాలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ ని సంపాదించారు. ఇక అదే ఊపుతో ఆయన నటించిన లేటెస్ట్ సినిమా సాహో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ ఇంపాక్ట్ ని మూటగట్టుకుని, కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. 

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాకు భారీ రేంజ్ లో ఖర్చు పెట్టారు కానీ, కథ మరియు కథనాల విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టలేదని, సినిమా చూసిన మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక ఆ సినిమా ఇచ్చిన నెగటివ్ రిజల్ట్ తో, ప్రస్తుతం తాను నటిస్తున్న జాన్ సినిమాపై ప్రభాస్ ఎంతో శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమా కథ పై దర్శకుడితో కలిసి కొన్ని గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ప్రభాస్, అందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా దగ్గరుండి మరీ చేయించినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. అంతేకాక, షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి సన్నివేశాన్ని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ చిత్రీకరిస్తోందట సినిమా యూనిట్. 

బాహుబలి సినిమాలతో సంపాదించిన మంచి పేరుని తప్పకుండా ఈ జాన్ తో ప్రభాస్ మళ్ళి సంపాదిస్తారని అంటోందట జాన్ సినిమా యూనిట్. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక రెట్రో ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ, మంచి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా జోడించి నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: