సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకుడు, మాటల మాంత్రీకుడు త్రివిక్రం ఆవిష్కరించిన అతడు ఎంతో ప్రత్యేకమైనవి. దూకుడులో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్, అతడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు చాలా కీలకమైనవి అని.. అవే ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడానికి పెద్ద రీజన్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు సినిమాల్లో ఈ రెండు అంశాలను మించి ఉండేలా రూపొందుంతోందట 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి డైరక్షన్ లో రెడీ అవుతున్న సరిలేరు నీకెవ్వరు గురించి ఇండస్ట్రీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తిన్నాయని సమాచారం. 

సినిమా ఫస్టాఫ్ దూకుడు మాదిరిగా ఫుల్ ఎంటర్ టైనర్ తో, సెకండాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోషన్లు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుందని లేటెస్ట్ న్యూస్. సినిమాలో విజయశాంతి పాత్ర.. అతడు సినిమాలో నాజర్ లా, ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ విజయశాంతి లాగా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. విజయశాంతికి ఈ సినిమా పక్కా కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని కూడా చెప్పుకుంటున్నారు. అలాగే కమెడియన్ల కొరత వున్న టాలీవుడ్ కు బండ్ల గణేష్ పాత్రతో మళ్లీ అతనికీ కమ్ బ్యాక్ పిల్మ్ అవుతుందట.
సినిమాలో కీలక ట్రైన్ ఎపిసోడ్ లెంగ్తీగా ఉన్నప్పటికి రవితేజ 'వెంకీ' సినిమాలో సీన్ లాగ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ తో వుంటుందట.

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కన్నా, నెరేషన్, మాస్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా వుంటుందని అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమాతో అనిల్ రావిపూడి మంచి కథకుడు అన్న పేరు కూడా వస్తుందని ధీమాగా ఉన్నాడట. అందుకే రెండు రకాలషేడ్స్ వున్న కథను రాసుకున్నాడట. అందువల్ల సినిమా తొలిసగం అంతా దూకుడు లాగా, మలిసగం అతడు సినిమా లాగా ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకుండా చూసుకున్నాడట అనిల్ రావిపూడి. ఈ సినిమాను జనవరి 11న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఇదే అఫీషియల్ డేట్ అని మాత్రం కన్‌ఫర్మేషన్ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: