అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు తీసినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు అఖిల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తునాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ ఏ సినిమా చేస్తాడన్న విషయంపై క్లారిటీ ఉంది.


అఖిల్ 4వ సినిమా పూర్తి కాకముందే 5వ సినిమా లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ ఎవరి డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుంది అంటే గీతా గోవిందం దర్శకుడు పరశురాం అని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత పరశురాం అలియాస్ బుజ్జి మహేష్ కోసం ఓ కథ అనుకున్నాడు. మహేష్ ను కలిసి వినిపించాడు కూడా.


పరశురాం చెప్పిన కథ బాగున్నా మహేష్ ఎందుకో కాదన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ కథతోనే అఖిల్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలని చూస్తున్నాడు పరశురాం. అతను చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ కూడా ఓకే అన్నాడట. అయితే అఖిల్ ఇమేజ్ ఎక్కడ, మహేష్ క్రేజ్ ఎక్కడ. అయినా సరే మహేష్ కథను అఖిల్ కోసం సెట్ చేస్తునాడట.


గీత గోవిందం సూపర్ హిట్టైనా పరశురాం కు చాలా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. కాని ఆయన మాత్ర ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మ్రిల్లు భాస్కర్ సినిమా చేస్తున్నాడు. అది హిట్ అయితే ఆ వెంటనే పరశురాం సినిమా కూడా కమర్షియల్ గా హిట్టు పడితే అఖిల్ కెరియర్ సెట్ రైట్ అయినట్టే. ఇప్పటికే నాగార్జున కొడుకుల విషయంలో తీసుకునే ఓవర్ కేర్ పై సిని వర్గాల్లో విమర్శలు వచ్చేలా చేస్తుంది. అందుకే ఈమధ్య చైతు, అఖిల్ సినిమాల విషయాల్లో నాగార్జున జోక్యం చేసుకోవడం లేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: