సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి -సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలోని ఇంట్రడక్షన్ సాంగ్ లో  మిల్కీ బ్యూటీ తమన్నా  లేదా  పూజా హెగ్డే  నర్తించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో  తమన్నా ను ఈ ప్రశ్న అడగగా.. అవును ఆ సినిమా ఇంట్రో సాంగ్ కోసం  ఒప్పుకున్నాను  ఆమె క్లారిటీ ఇచ్చింది.



కాగా గతంలో  మహేష్ నటించిన  దూకుడు లో తమన్నా  ఇంట్రో సాంగ్ లో కనిపించగా ఆ చిత్రం  సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. డిసెంబర్ లో  ఈ ఇంట్రోసాంగ్ ను  షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం   రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్  ను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.  కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకానుంది.



ఈ చిత్రంలో   మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది.   వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  ఇక ఇటీవల  వరుసగా  సూపర్ హిట్లు కొట్టి  మహేష్ -అనిల్ రావిపూడి  ఫుల్ ఫామ్ లో ఉండడంతో  ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: