ఇక బుధవారం నుండి సైరా హావ కొనసాగనుంది. తెలుగు రాష్టాల్లో ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలకానుంది. దాంతో థియేటర్లు అన్ని ఈ సినిమాకే కేటాయించనున్నారు. రెండవ రోజు నుండి కొన్ని థియేటర్లలో సైరా ను తీసేసిన ఆతరువాత మరో రెండు రోజుల గ్యాప్ లో గోపిచంద్, చాణక్య విడుదలకానుంది. దాంతో మిగిలిన థియేటర్లను చాణక్య ఆక్రమించనున్నాడు. అలా గద్దలకొండ గణేష్ స్క్రీన్ కౌంట్ భారీగా పడిపోతుంది. దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం గా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 20వ తేదీన కాకుండా ఇంకో వారం ముందు రిలీజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని చిత్ర యూనిట్ ఫీల్ అవుతున్నారట.
హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజా హెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించగా ఎం,మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ అంచంట , గోపిఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.