ఇక ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క దసరా కానుకగా వచ్చే వారంలో విడుదలకానుంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గసైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక గత ఏడాది టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటొని రూపంలో మూడు భారీ డిజాస్టర్లను చవిచూసిన రవితేజకు డిస్కోరాజా విజయం కీలకం కానుంది.
ఈచిత్రం తరువాత రవితేజ , గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో నటించనున్నాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను నిరాశ పరచగా బలుపు సూపర్ హిట్ అయ్యింది. మరి ఈమూడో చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.