దాదాపు 15 సంవత్సరాల క్రితం హీరోయిన్లుగా కెరీర్ మొదలుపెట్టారు నయనతార మరియు తమన్నా. ప్రస్తుతం నయనతారకు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నయనతార ఎక్కువగా నటిస్తోంది. ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు నయనతార రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ నయనతార ఏ సినిమాలో నటించినా షూటింగ్ అయిపోయిన తరువాత ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనదు. 
 
పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా అందరి విషయంలోను నయనతార ఇదే విధంగా బిహేవ్ చేస్తుంది. దాదాపు 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కింది. కనీసం ఈ సినిమా ప్రమోషన్లకైనా నయనతార వస్తుందని ప్రేక్షకులు భావించారు. ఈ సినిమాలో నయనతార ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో కనిపిస్తుంది. 
 
ఇంత ముఖ్యమైన పాత్రలో నటించిన నయనతార ప్రమోషన్లలో పాల్గొనకపోయినా ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన తమన్నా మాత్రం బాలీవుడ్, కోలీవుడ్ ప్రమోషన్లలో పాల్గొంటుంది. లక్ష్మి అనే చిన్న పాత్రలో తమన్నా నటించింది. సినిమా ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొంటూ ఉండటంతో నయనతార కంటే తమన్నా ఎంతో బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
 
మరో మూడు రోజుల్లో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లో 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 220 కోట్ల రూపాయల షేర్ రాబడితే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: