బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. దీంతో వెంటనే డైరెక్టర్ సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అని ఎనౌన్స్ చేయడం జరిగింది. అయితే చివరాకరికి మహేష్ బాబు తో సుకుమార్ చేయవలసిన సినిమా మహేష్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ని వెయిటింగ్ లిస్ట్ లో మహేష్ పెట్టడంతో...వెంటనే సుకుమార్ బన్నీతో సినిమా ఒప్పుకోవటం జరిగింది. ఇదే క్రమంలో మహేష్ తో చేయాల్సిన సినిమా క్యాన్సల్ అయింది. ఇప్పుడు ఇదే క్రమంలో మహేష్ బాబు సుకుమార్ లాంటి షాక్ గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం ఇచ్చినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే మహేష్ బాబు తో గతంలో గీతాగోవిందం వంటి సూపర్ డూపర్ కొత్త సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ పరశురాం తో చేయవలసిన సినిమా వెయిటింగ్ లిస్టులో పడే అవకాశం ఉండడంతో….మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఎక్కువ టైమింగ్ గ్యాప్ రాకూడదని...పరశురాం భావించాడట.


దీంతో ఇప్పుడు మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా అక్కినేని ఇంటి వారసుడు అక్కినేని అఖిల్ తో చేయడానికి డిసైడ్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. గతంలో డైరెక్టర్ పరుశురాం గీతగోవిందం సినిమా ని అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు 70 కోట్ల మేరకు లాభాలు సాధించాడు. దీంతో డైరెక్టర్ పరుశురాం పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోయింది. కాగా ఆ తర్వాత మహేష్ బాబు తో పరశురాం సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అవటానికి ఎక్కువ టైం పడే అవకాశాలు ఉన్న క్రమంలో సేమ్ స్టోరీ తో అక్కినేని అఖిల్ తో పరశురాం సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: