ప్రముఖ దర్శక, రచయిత, నిర్మాత కోన వెంకట్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారని తాజా సమాచారం. ఈ మధ్య చాలాకాలంగా కోన వివాదాలకు, కాంట్రవర్సీలకు చాలా దూరంగా వుంటున్నారు. అమెరికాలో వుంటూ అనుష్క హీరోయిన్ గా తెరకెక్కుతున్న నిశ్శబ్ధం సినిమా వ్యవహారాలు, కొత్త స్క్రిప్ట్ లు రాసుకునే పనిలో తలమునకలై వున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి రావడం మళ్ళీ అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో కోన ఒకటి రెండుసార్లు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూలో కోనవెంకట్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన తగిన రుజువులు చూపించడంతో వ్యవహారం సద్దుమణిగింది.

అయితే ఇప్పుడు వచ్చింది మాత్రం 420 చీటింగ్ కేసు అని తెలుస్తోంది. కథ ఇస్తానని డబ్బులు తీసుకున్నారట కోన వెంకట్. కానీ కథ ఇవ్వకపోగా, తీసుకున్న డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వడంలేదని ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. వాస్తవంగా చూస్తే ఇలాగే జరిగే ఆస్కారం తక్కువ. ఎందుకంటే కోనవెంకట్ స్థోమత ముందు పది-పన్నెండు లక్షలు చాలా చిన్న అమౌంట్. మరి ఎందుకు వెనక్కు ఇవ్వడం లేదు అన్న విషయంలో ఖచ్చితమైన క్లారిటి లేదు.

అసలు ఈ విషయంలో ఏం జరిగింది? ఈ విషయంలో కోన ఏం మాట్లాడతారన్నది కూడా పోలీసులు తెలుసుకోవడం అవసరం. ఇక కోనవెంకట్ మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కారణం కోన వెంకట్ బావ ద్రోణంరాజు శ్రీనివాస్, బాబాయ్ కోన రఘుపతి ఆంధ్రలో కీలక పదవుల్లో వున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో కోన కి పెద్ద ఇబ్బందులేమి ఎదరవవు కానీ ఈ కేసు విషయంలో జరిగిన విషయం చెప్పి తన వెర్షన్ క్లియర్ చేసుకుంటే బావుంటుంది కదా..! ఇక కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మిస్తున్న సైలెన్స్ మూవీ మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతోంది. అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: