మంచు హీరోలకు ఒక మంచి హిట్టు పడి చాలా కాలమయ్యింది. విష్ణు.. మనోజ్ కెరీర్ ఏంటన్నచర్చ గత కొంత కాలంగా ఫిల్మ్ నగర్ లో సాగుతోంది. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రం తన పంథా మార్చి క్రేజీ డైరెక్టర్ల సినిమాలలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాతో పాటు సూర్యతో మరొక సినిమాలో మోహన్ బాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే మంచు విష్ణు ఈ సారి ఎలాగైనా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అన్న విధంగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇక మంచు మనోజ్ కూడా సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుని రీఎంట్రీ సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నాడని తాజా సమాచారం. 

అయితే అనుకోకుండా మంచు ఫ్యామిలీ ముగ్గురు హీరోలు ఒకేసారి రీఎంట్రీలతో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. కాల్ సెంటర్ టైటిల్ తో రూపొందుతున్న ఒక ఇంగ్లీష్ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో విష్ణు కి సోదరికిగా కనిపించబోతుండటం విశేషం. రుహానీ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చైన్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగులోనూ రూపొందనున్న ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 100కు పైగా హిందీ సినిమాల్లో నటించిన సునీల్ షెట్టి మొదటిసారి కన్నడ సూపర్ హిట్ సినిమా 'పహిల్వాన్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. 

సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై కన్నడలో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు సునీల్ శెట్టి పాత్ర కూడా ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. 
విష్ణు నటిస్తున్న కాల్ సెంటర్ సినిమాలోలో సునీల్ శెట్టి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని.. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్. గత కొన్నేళ్లుగా మాంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు బాలీవుడ్ హీరో ఎంత వరకూ ప్లస్ అవుతాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: