టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద అనే సినిమాతో హీరోగా పరిచయమైన మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క తనయుడైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తొలి సినిమాలో మంచి పెర్ఫామెన్స్ చేసినప్పటికీ ఆ సినిమా మాత్రం పెద్దగా విజయవంతం కాలేదు. ఇక ఆ తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కంచె, ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు మంచి విజయవంతం అయి వరుణ్ కి మంచి క్రేజ్ మరియు పేరు తీసుకొచ్చాయి. 

ఇక మొన్న సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసింది. మంచి ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు సూపర్ హిట్ ని అందించారు. ఇక దాని తర్వాత ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా కూడా సూపర్ హిట్ అందుకొని వరుణ్ కెరీర్ కి చాలా హెల్ప్ చేసింది. కెరీర్ లో తొలిసారి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన వరుణ్, ఆ పాత్రకు జీవం పోశారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇకపోతే త్వరలో తన తదుపరి సినిమా చేసే ఆలోచనలో ఉన్న వరుణ్, 

ఆ సినిమాలో మరొక మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించనున్నట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాను టాలీవుడ్ లోని ఒక ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్నట్లు టాక్. కాగా దీని పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి నేడు విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఏకంగా డబుల్ బొనాంజా దక్కినట్లే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: