మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా, అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 

అలానే తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ తదితర భాషల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ సినిమాల దర్శకుడు వివి నాయక్ ప్రత్యేక అతిథులుగా హాజరు అవ్వగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఇక నేడు కన్నడ భాషకు సంబంధించి బెంగళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈతో వైభవంగా నిర్వహించింది సైరా సినిమా యూనిట్. ఇక ఈ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 

తన కెరీర్లో ఇప్పటి వరకు ఎందరెందరో నిర్మాతలు తనతో కలిసి ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారని, అయితే వారందరిలో తనను నమ్మి దాదాపుగా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీయటానికి ఏ మాత్రం ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు వచ్చిన తన తనయుడు రామ్ చరణ్, తన ఎంటైర్ సినిమా కెరీర్లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా నిలిచాడు అని చిరంజీవి కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని, తప్పకుండా ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు మెగాస్టార్. మరొక్క రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: