పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గత ఏడాది ఆయన సిల్వర్ జూబ్లీ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన సినిమా అజ్ఞాతవాసి. అంతకు ముందు పవన్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చి ఉండటంతో హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న అజ్ఞాతవాసి పై పవన్ ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 

అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాక పలు వివాదాలకు కూడా కారణం అయిన ఆ సినిమా, పవన్ ఫ్యాన్స్ కు కూడా నచ్చక పోవడం గమనార్హం. ఇకపోతే ఈ ఫ్లాప్ సినిమా, నేడు ఏకంగా వంద మిలియన్ల క్లబ్ లో చేరిపోయి పెద్ద రికార్డుని క్రియేట్ చేసింది. అయితే అది కలెక్షన్ల పరంగా కాదు యూట్యూబ్ న్యూస్ పరంగా. 

ఇటీవల ఈ సినిమాని ఎవడు 3 పేరుతో హిందీ వర్షన్ లో డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాని కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఇక నేటితో ఈ సినిమా వంద మిలియన్లకు పైగా న్యూస్ ని దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక్కడ బయ్యర్లకు భారీ నష్టాలు తీసుకొచ్చిన అజ్ఞాతవాసి సినిమా, యూట్యూబ్ లో మాత్రం ఈ విధంగా దుమ్ము రేపుతూ నార్త్ ఇండియన్స్ ని ఆకట్టుకోవడం పై పలువురు పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: