బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ అది. డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా స్టోరీ విషయంలో కాని సీన్స్ విషయంలో కాని ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.


అయినా సరే ఆర్.ఆర్.ఆర్ కు సంబందించిన లీకులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో హైలెట్ సీన్ ఒకటి మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశారు. సినిమాలో చరణ్ అలూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఒక సీన్ లో చరణ్ ను తొక్కేసుకుంటూ వెళ్తూ ఉండే సీన్ ఒకటి ఉంటుందట. ఆ సీన్ ఎంతో హృద్యంగా ఉంటుందని అన్నారు చిరంజీవి.


చాలా ఎమోషనల్ గా ఆ సీన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ గురించి ఎలాంటి వార్త వచ్చినా సర్ ప్రైజ్ అయ్యే ఫ్యాన్స్ చిరు చెప్పిన లీక్స్ పై క్రేజీగా ఉన్నారు. అలూరి పాత్రలో రాం చరణ్ అదరగొట్టాడని టాక్. ఇక సినిమాలో తారక్ కూడా కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కూడా సినిమాలో చేరేగిపోతున్నాడని తెలుస్తుంది.


అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడు. 2020 జూలై 30న ఎట్టిపరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అనుకున్న విధంగా షూటింగ్ జరుగకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దానికి సంబందించిన అఫిషియల్ న్యూస్ మాత్రం బయటకు రాలేదు. చరణ్, ఎన్.టి.ఆర్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ సినిమాపై భారీ అంచనాలు కలిగి ఉన్నారు. వారి ఫ్యాన్స్ కూడా సినిమా మరో బాహుబలి కాదు కాదు అంతకు మించి అనేలా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: