రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించి ఎటువంటి లీక్స్ జరుగకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తూంటాడు రాజమౌళి. అయినా.. బాహుబలిలో కొన్ని సీన్లు బయటకొచ్చేశాయి. ఇప్పుడు ఆ సమస్య ఆర్ఆర్ఆర్ కు కూడా వస్తోంది. ఈసారి లీక్స్ చేస్తోంది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి కావడం విశేషం.

 


ఈ సినిమాలో చరణ్ చేసిన ఓ ముఖ్యమైన సీన్ ను చిరంజీవి అత్యుత్సాహంతో చెప్పేశారు. సైరా ప్రమోషన్లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పడుతున్న కష్టం ఇదీ.. అంటూ నోరు జారారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరగటం మాటేమో కానీ.. ఓ సీన్ ను లీక్ చేసినట్టైంది. దర్శకుడిగా రాజమౌళి సినిమా ప్లాట్ గురించి మాత్రమే చెప్పాడు. షూటింగ్ లో సన్నివేశాల గురించి ఏ దర్శకుడూ.. హీరో కూడా ముందే చెప్పుకోరు. సన్నివేశాలు ముందే తెలిసిపోతే ఇక ప్రేక్షకులకు కిక్ ఏముంటుంది. కానీ.. చిరంజీవి పూస గుచ్చినట్టు చెప్పేయడం రాజమౌళి, చరణ్ తో సహా ఎవరికీ నచ్చకపోవచ్చు. చిరంజీవి అభిమానులే.. ‘ఇలా సీన్స్ లీక్ చేస్తే ఎలా బాస్..’ అంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

 


రంగస్థలం విషయంలో.. వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినిమా క్లైమాక్స్ లో ఆది చనిపోతాడు అంటూ మెయిన్ సీన్ చెప్పేశారు. ఈ విషయంపై సుకుమార్.. ‘చిరంజీవి గారు లీక్ చేసేశారు.. ఇప్పుడెలా’ అని అనుకున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏదేమైనా.. చిరంజీవి ఇలా లీక్స్ ఇవ్వడం సరికాదు. నోరు జారుతున్నాడో.. వయసు చాదస్తమో కానీ చిరంజీవి ఇకపై జాగ్రత్తగా ఉంటే బెటర్. రంగస్థలం సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓకే.. లేదంటే చిరంజీవిపై విమర్శలు ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: